Monday 8 October 2012

భాగ్యనగరం లో జీవ వైవిధ్య సదస్సు

మన భాగ్య నగరం లో జరుగుతున్న జీవ వైవిధ్య సదస్సు (Conference on Bio diversity) సందర్భం గా కొన్ని వేద మంత్రాలు
మం॥ సముద్ర  వసనే దేవి పర్వత  స్థన   మండితే।విష్ణు పత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే।
       ప్రతి రోజు పడక నుండి లేస్తూనే కాళ్ళు నేలపై పెట్టె ముందు భూమిని ప్రార్థించడము మన పెద్దల నుండి వస్తున్న సంప్రదాయం.
 మం॥ ఓం  మధువాతా  ఋతాయతే మధుక్షరంతి సింధవః। మాధ్వీర్నస్సంత్వోషధీః । మధు నక్తముతోషసి మధుమత్పార్థివగ్ం రజః\ మధుద్యౌరస్తు నః పితా । మధుమాన్నో వన్స్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః । మాధ్వీర్గావో భవంతు నః॥
   ఋతాయతే= మంచి కార్యం చేయాలని కోరే న్ః= మనకు  మధువాతా=మాధుర్యమైన గాలి వీచుగాక,
సింధవః=నదులు ,మధుక్షరంతి=తియ్యని నీటితో ప్రవహించు గాక, ఓషధీః = చెట్లు, మాధ్వీః సంతు=పుష్టిగా ఉండుగాక, నక్తం ఉత ఉషసి= రాత్రింబవళ్ళు  మధు=మాధుర్యాన్ని అందించు గాక,పార్థివగ్ం రజః= భూమి;
మధుమత్=తియ్యదనాన్ని ఇచ్చుగాక,న్ః=మన, పితా=తండ్రియైన ద్యౌః =ఆకాశం,మధు=మాధుర్యాన్ని 
వర్షించు గాక. వనస్పతిః =చెట్టు,చేమలకు అధిపతి యైన్ చంద్రుడు మధుమాన్= తియ్యగా(చల్లగా)
 ఉండుగాక,గావః=పశువులు,నః=మనకు, మాధ్వీః భవంతు=తియ్యదనాన్ని (తియ్యటి పాలను) 
ఇచ్చుగాక.తియ్యగా(పరిశుభ్రమైన గాలి) వీచు గాక్, నదులు తియ్యని నీటితో(స్వచ్చమైన) ప్రవహించు గాక,ఆకాశం 
  మన పూర్వీకుల పర్యావరణ చింతనా ధృక్పధం ను సూచించే మంత్రాలలో యీ మంత్రం ఒకటి. గాలి మాధుర్యాన్ని వర్షించు గాక,చెట్టూ ,చేమలు పరిపుష్టిగా పెరుగు గాక, పశువులు    పాలను అధికంగా
ఇచ్చుగాక,  ప్రకృతిని  మనం పరిశుధ్ధం గా ఉంచుకొన్నప్పుడే అది మాధుర్యాన్ని వర్షింస్తుంది,
మం॥ శంన్నో దేవీరభీష్టయ ఆపో  భవంతు పీతయే। శం యోరభి  స్రవంతు నః।
     దివ్యులైన ఓ జలదేవతలారా !మా పూజలలో మీరు ప్రసన్నులవుతారు గాక! మేము త్రాగడానికి నీరు అనువైనదిగా ఉండు గాక,మాకు మంగళకరాన్ని ప్రసాదించుదురు గాక!