Monday 21 November 2022

శ్రీ సత్య నారాయణ వ్రత కథ సులభ శైలి లీ

 

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం లోని ఐదు అధ్యాయముల కథలు సులభ శైలిలో

 

శ్రీరస్తు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః

॥శ్రీ సత్యనారాయణ వ్రతకథ॥

॥అథ ప్రథమాధ్యాయము॥

శ్లో॥ ఏకదా నైమిశారణ్యే ఋషయశ్శౌనకాదయః।

                                       ప్రపుఛ్ఛరానతం మునయ సర్వే సూతం పౌరాణికం ఖలు॥

        ఒకసారి కొనకాది మహామునులు నైమిశారణ్యంకి వెళ్ళి అక్కడున్న సూతమహామునిని  దర్శించారు. వారు  ఆయనతో  " స్వామీసకల ఐశ్వర్యములుపుత్రపౌత్రాభివృద్ధిమోక్షం కలిగించే వ్రతం ఏదైనా  తెలపండిఅన్నారు దానికి వారు. “ శౌనకాది మహామునులారాపూర్వం ఇదే ప్రశ్న  నారదులవారు  విష్ణుమూర్తిని అడిగారు విశేషాలు చెప్పుతాను శ్రద్ధగా వినండి.అన్నారుపూర్వం యోగీశ్వరుడైన నారద మహాముని లోక క్షేమం గురించి  సకల లోకములు తిరిగాడుఅన్ని చోట్ల అందరు ఆనందంగానే ఉన్నారు కాని భూప్రపంచమైన మనుష్యలోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడటం గమనించాడు దు:ఖం మనస్సుకి సంబంధించింది కావచ్చుశరీరానికి సంబంధించిందికావచ్చుధనధాన్యాం కోసం కావచ్చుకారణమేదైనా దుఃఖశాతం ఎక్కువేఇది చూసిన నారదముని చాలా విచారించితక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గర కెళ్ళాడుఅచ్చట నిర్మల శరీరకాంతితో నాలుగు చేతుల లో శంఖచక్రగదా పద్మములు కలిగి సర్వాలంకృతుడైన విష్ణుమూర్తిని  దర్శించి భక్తితో పూజించి  పరమేశ్వరానీవు అపరిమితమైన శక్తి గలవాడవుసర్వలోకాలకు మేలు చేయగల వాడవు : భక్తుల కోర్కెలు తీర్చగలవాడవు.” అనగా విని "భక్తా ఏమి నీ కోరిక ?" అన్నాడు విష్ణుమూర్తి.

         దానికి నారదమహాముని " భగవంతుడామానవలోకంలో ప్రతి ఒక్కరు    ఏదో విధంగా బాధుడుతూనే ఉన్నారుఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదువాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదానువ్వు తలచుకుంటే వారికి తరుణో పాయం చూపించలేవా?  నామీద నీకు ఏమాత్రం దయ ఉన్నావాళ్ళ మీదకి  కృపారసాన్ని  విస్తరించు” అన్నాడునారదముని  యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు “ నారదాలోక శ్రేయస్సు కు నువ్వు  మంచి చేయదల్చుకుంటే నేనెందుకు సాయి పడనుమానవులు తలుచుకోవాలే కాని వారి కష్టం చిటికెలో తొలగిపోయే ప్రతం ఒకటి ఉందిఎంతో పుణ్యం కలిగించే మరియు కష్టాలని నివారించే ప్రతమొకటి ఉంది.      దాని పేరు సత్యనారాయణ వ్రతముదానిని యధావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలుపరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి.” అన్నాడు.

        “ స్వామీ వ్రత ఫల మెటువంటిదిదాని విధాన మేమిటిఇంతకు ముందు దీనినెవరు చేసారుఎప్పుడు చేయాలిఇవన్నీ వివరంగా చెప్పండి.అన్నాడు నారదుడు.

    అప్పుడు ఆ శ్రీ హరి “దీనిని ఆషాడంలో కానికార్తీక మాసంలో కాసిమాఘమాసంలో కానివైశాఖంలో కాని ( కామావైఏకాదశి రోజు కానిపూర్ణిమనాడు కానిసూర్యసంక్రమణ రోజుని చేస్తే శ్రేష్టంఅలా అని  రోజుల్లోనే చేయాలని లేదు రోజన్నా నెలలో అన్నా    సంవత్సరములోనైనా చేయవచ్చునెల కొకసారి చేయవచ్చుసంవత్సరానికొక సారి చేయవచ్చురాజులైతే యుద్ధం ప్రారంభించే ముందు వర్తకులైతే వ్యాపారం మొదలెట్టె ముందు కానిఏదైనా పని ప్రారంభించే ముందు కానిఆపద కలిగి నప్పుడైనాడబ్బు సమస్య ఎదురైనప్పుడైనాఎప్పుడైనా  చేయవచ్చుప్రొద్దున్న లేచికాల కృత్యాలు తీర్చుకొని విధంగా సంకల్పం  చెప్పుకోవాలి: “దేవతలందరికీ ప్రభువైన  భగవంతుడానీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను లక్ష్మీ పతీనా పై ప్రసన్నుడవు కమ్మునీ ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతం చేయగలను”. అలా  అని  భక్తి శ్రధ్ధలతో  సాయంకాలం వరకు ఉపవసించి మరల స్నానం చేసి ఈ వ్రతం మొదలు పెట్టాలి(రాత్రి కుదరని వారు ఉదయం చేయవచ్చు). పూజాగృ హాన్ని శుధ్ధి  చేసిపిండితో ముగ్గులు వేసీ అచ్చట ఒక పీటపై  అంచుగల  కొత్త  తెల్ల తువాల పరువాలిదాని మీద బియ్యం  పోసి ఒక కలశ  పాత్ర (వెండిరాగిఇత్తడి ఏదైనాపెట్టి దాని మీద కొబ్బరి కాయ నుంచి దాని మీద రవికెలగుడ్డ ఉంచాలిఆ పీటపై బియ్యం మధ్యలో  సత్యనారాయణస్వామి ప్రతిమను  చేయించి పెట్టవలెను. (అది కుదరని వారు ఫోటో పెట్టి పూజ చేయవచ్చు).  సత్యనారాయణ స్వామికి పంచామృత స్నానం చేయించి మంటపముపై ఉంచాలివినాయకుడులక్ష్మీదేవివిష్ణువుపార్వతీ పరమేశ్వరులుసూర్యాది సవగ్రహాలుఇంద్రుడు మొదలగు  అష్టదిక్పాలకులు  స్వామికి అంగదేవతలను ముందుగా  పూజించాలిముందు {వరుణదేవుణ్ణి} కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలితరవాత గణేశుడు మొదలగు పంచ లోక పాలకులను అయిదుగురిని  ప్రతిష్టించి నిర్మల మనస్సుతో  పూజించాలి.

    దీనికి జాతిమతకుల విబేధాలు లేవు వర్ణము వారైనా చేయవచ్చుస్త్రీలు కూడా చేయు వచ్చు. నారదా!   వ్రతము అన్నిరకాల సంపదలను ఇస్తుంది.  దుఃఖాలను తొలగిస్తుందిధనం వృద్ధి చెందుతుంది.పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందివేయేల సకల సౌభాగ్యములు కలుగుతాయిఅన్నాడుఒక మంచి రోజు చూసిబంధు మిత్రులను పిలిచిపంచభక్ష్య పరమాన్నాలు చేసిపూలుఫలము భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములిచ్చిబంధు మిత్రులకువిందు భోజనాలు పెట్టిప్రసాదము తాను తిని యితరులకు పెట్టాలిఇట్లా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు ఈడేరి  సంతోషముగా ఉంటారు వ్రతము విశేషముగా కలియుగములో  విశేష పలితాన్నిస్తుంది చెందినది అని విష్ణుమూర్తి  నారదునికి చెప్పి నట్లు  సూత మహాముని శౌనకాది మునులకు చెప్పాడు.

                  ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయః॥ ఓం తత్సత్॥

                       శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హరతి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                 అథ ద్వితీయాధ్యాయః॥

        ఓ ఋషులారాపూర్వం  వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండికాశీ పట్టణములో ఒక  చాలా  బీద బ్రాహ్మణుడుండేవాడుతినటానికి సరియన తిండిలేక చాలా బాధపడుతుండేవాడుఅతని బాధ చూసి జాలిపడి శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమయి అతని కష్టము లేమిటో  చెప్పమని అడిగాడు బాహ్మణుడు తన పేదరికం తొలగి మార్గం చెప్పమని కోరాడుదానికామహా విష్ణువు సత్యనారాయణుడని పేరు గల విష్ణువును పూజిస్తే  సకల కోరికలు తీరుస్తాడుసమస్త దు:ఖములు తొలగిస్తాడునీవు ఆ వ్రతం చేయమనిఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్జాన మయ్యాడు రాత్రి  బ్రాహ్మణుడు నిద్రపోకప్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని ఉండి  మర్నాడుదయాన్నే బిక్షాటనకు  బయలు దేరాడుఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువగా ధనము సమ కూరిందిదానితో బంధుమిత్రులను పిలిచి వ్రతము చేసాడుఆదేవ దేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వసంపదల కధికారి అయ్యాడుఅప్పటినుంచి అతను ప్రతి నెలా  వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొందిఅతి దుర్లభమైన మోక్షమును పొందాడు.

           కాబట్టి  వ్రతమును ఏమనుష్యుడు చేస్తాడో అతనికి సర్వదుఃఖములు తొలగుతాయి  బ్రాహ్మణుడి వలన విని వేరే ఎవరు చేసారో తెలపమని శౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. సూతమహర్శి వారు ఇలా చెప్పుతారు. ఆ బ్రాహ్మణుడు యధావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగాఒక రోజు ఒక కట్టెలమ్మే  అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడుబాగ దాహం వేసినీళ్లు అడుగుదామని వస్తేఅక్కడ ఏదో పూజ జరుగుతూండటం చూసి  బ్రాహ్మణుడిని దాని విశేషమేమిటో చెప్పమంటాడుబ్రాహ్మణుడు తన కథంతా వివరంగా చెప్పిఎలా కష్టములు తొలగాయో చెప్పేసరికి  కట్టెలమ్మ అతనికి  వ్రతం మీద బాగా గురి కుదురుతుంది వ్రతమయ్యేవరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకునివెంటనే తను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు కట్టెలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తానన అనుకుంటాడుఅనుకోవటమే తడవు ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చిందిఅతను కూడా బంధుమిత్రులతో కల్సి వ్రతం చేసాడునిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళుచక్కెరనెయ్యిపాలు,గోధుమ పిండి మొదలగు వాటిని  సేకరించుకొని వచ్చి భక్తితో వ్రతం ఆచరించి   నైవేద్యం పెట్టాడుఈ వ్రత మహత్యముచే ఆతడు  పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ఇహ లోకంలో సుఖ సంతోషాలతో  జీవించి సత్య లోకమునకు చేరాడు.

   ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయో ధ్యాయః॥     ఓం తత్సత్॥

               శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హారతి  ఇవ్వాలి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                ॥తృతీయాధ్యాయము॥

                పూర్వము సత్మవాక్కు గల ఉల్కా ముఖుడనే రాజు ఉండేవాడుఅతడు సత్ప్రవర్తన కలిగి ఉండేవారుఅటు భద్రశీలా  అనే నదీతీరమున భార్యతో కలిసి సత్యవ్రత మాచరిస్తుండేవాడుఅలా వ్రతము చేయుచుండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక వైశ్యుడు వచ్చి, “ రాజా! ఇది ఏమి వ్రతముదీని ఫలితమేమిటిఅన్నాడురాజు వివరంగా చెప్పి "నాకు పిల్లలు లేరుపిల్లలు కలుగడానికి చేస్తున్నానుఅనగానే  వైశ్యుడు, "రాజానాక్కూడా పిల్లలు లేరు,  నేను కూడ ఈ వ్రతం చేస్తాను", అంటూ ఆరోజు ఇంక వ్యాపారానికి స్వస్తి  చెప్పి తొందరగా ఇంటికెళ్ళి భార్య యైన  లీలావతికి  ఈ విషయం చెప్పాడుతనకు ఎప్పుడు సంతానము కలుగుతుందో అప్పుడే   వ్రతం ఆచరిస్తానని మొక్కుకున్నాడుకోరిన కోర్కెలు తీర్చే సత్య దేవుడు అతనికి ఒక కుమార్తెను  ప్రసాదించాడుఆపద మొక్కులు సంపద ముంపులు అని అనే మాట ఊరికే రాలేదు కదా!  అమ్మాయికి కళావతి  అని నామకరణం చేసారుకానీ  వేడుకలో స్వామిని మరిచాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదయింది.యుక్త వయస్సు వచ్చింది.భార్య సత్యదేవుని మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేసినా అమ్మాయి పెళ్ళి లో చేద్దాం లే అని దాట వేశాడు. తగిన వరుడిని గురించి విచారిస్తూ   కాంచీ పురం లో గుణవంతుడు అందగాడు అయిన వైశ్య కుమారుడున్నాడని విని అతనితో పెళ్ళి నిశ్చయించాడుఅప్పుడైనా మాట నిలబెట్టుకున్నాడా అంటే పెళ్ళి సంబరంలో పడి దేవుణ్ణి మరిచాడుదేవుడి సహనానికి కూడా ఒక  హద్దు ఉంటుంది కదాదాంతో నారాయణమూర్తి  కోపించిన వాడై తగిన సమయం కోసం వేచి ఉన్నాడుకొంత కాలమయ్యాక    మామాఅల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం చంద్రకేతు రాజకుమారుడుండే రత్నసాను పురానికి వెళ్ళారుఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖము కలగాలని సత్యనారాయణ స్వామి శపిస్తాడుఆ శాప వశము చే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారుకొత మంది దొంగలు  రాజు గారి ఖజానా నుండి సామ్ము దొంగిలించి భటులు వెంటబడుతుంటే భయపడి ఈ వైశ్యులున్న  చోట  డబ్బు వదిలేసి పారిపోయారు.  ఇంకేముంది భటులు మామ  అల్లుళ్ళని పట్టుకుపోయారురాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీన పరచుకున్నాడువాళ్లు కష్టాలు అక్కడితో ఆగలేదుసత్యనారాయణ స్వామి శాపవశాన ఇక్కడ యింటి దగ్గర పరిస్థితి కూడా విషమించిందిఇంట్లో దొంగలు పడి సొమ్మంతా అపహరించారుతినటానికి తిండిలేకసరియన ఆరోగ్యం లేక ఇల్లిల్లు తిరిగి డబ్బు సంపాదించి బ్రదికేవారు.

                అలా తిరుగుతుండగా   కళావతి ఒక రోజు ఒకరింట్లో  సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసిచివరి వరకు ఉండితీర్థప్రసాదాలు తీస్కుని ఇంటికి వస్తుంది,  ఆలస్యంగా ఇంటికి చేరిన  తన  కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్భాషలాడింది  తల్లితర్వాత విషయం  విని తన తప్పు తెలుసుకుంటుందిఅంతే కాకుండా తాము మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించిభర్తాఅల్లుడి రాకకోసం ఆగకుండా వెంటనే బంధు మిత్రులతో కూడి  వ్రతం నిష్టగా చేసిభక్తిగా దేవుడ్ని వేడుకుందితన భర్తనుఅల్లుడ్ని క్షేమంగా ఇంటికి చేర్చమని   కోరుకుంటుంది.   పశ్చాత్తాపానికి మించిన శిక్షలేదని లీలావతి పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కరిగిన సత్మ దేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడుసత్యదేవుడు చంద్ర కేతు మహారాజు కలలో కన్పించి వైశ్యులు అమాయకులనివాళ్ళని విడుదల చేసి వాళ్ళ  డబ్బులు వాళ్ళకిమ్మనిఅలా చేయని పక్షంలో అతనికి రాజ్యనష్టంపుత్రశోకంధన నష్టం కలుగుతుందని చెప్పుతాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే  రాజు మర్నాడు నిండుకొలుపులో తన స్వప్న వృత్తాంతం చెప్పి  వైశ్యులను చెఱనుండి విడిపించాడు.    వైశ్యులకు ఇంక భయము లేదనిదైవ వశము వలన  దుఃఖము కలిగిందని చెప్పివాళ్ళకి స్నానపానాదులు చేయించిమంచి బట్టలు యిచ్చివాళ్ళకి రెట్టింపు డబ్బు యిచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించి పంపాడు

      ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయో ధ్యాయః॥  ఓం తత్సత్॥ 

                శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హరతి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                        ॥అథ చతుర్థోధ్యాయః॥ 

     రాజు వద్ద సెలవు తీసుకుని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారువాళ్ళని పరీక్షించటానికి సత్యనారాయణ స్వామి త్రిదండి సన్యాసి వేషధారియై వచ్చి, “మీ ఓడలో ఎమి  ఉందని అడిగాడువైద్యులు  సన్యాసిని లెక్కచేయక పొగరుగా " దండీఏముంటే నీకెందుకు?  దొంగిలించటానికి వచ్చావాఆకులుఅలములు తప్ప ఏవీ లేవు పొమ్మని పరిహాసాలాడారు. “తథాస్తుఅని అంతర్ధానమయ్యాడుదండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడ కేసి చూడగా అతను పలికినట్లే ఆకులములు తప్పు ఏమీ లేకపోవటంతో మూర్చపోయినంత పనయిదుఃఖించసాగాడుఅల్లుడు వెంటనే “మామాఇది  త్రిదండి శాపమేఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా నున్నాడుఎలాగైనా అతని వద్దకు  పోయి వేడుకుందాం పదండిఅన్నాడుఅలాగే మామ అల్లుడు త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ని చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి తెలియక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారుఅప్పుడు  త్రిదండి, “బాధపడకునువ్వు నీ మాటనుల్లంఘించావునా పూజకు విముఖడయ్యావుఅందుకే నీకు మాటిమాటికీ దుఃఖం కలుగుతోందిఅన్నాడు అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే దేవదేవుడినిలా కీర్తించాడు. " నారాయణ మూర్తీ!   బ్రహ్మాది సమస్త దేవతలే మాయా మోహితులై ఒక్కోసారి నీ గొప్పతనమును గుర్తించలేరుమూఢుడనగు నేనెలా తెలుసుకొనగలనుకావున ఆగ్రహించక ప్రసన్నుడవు కమ్మునాశక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నానునాకు నా ధనము తిరిగి ప్రసాదించు స్వామీ?" అన్న ప్రార్థనకు ప్రసన్నుడయిన ఆ దేవ దేవుడు వారి కోరిక నెరవేర్చాడుమళ్ళీ ధనముతో నిండిన ఓడతో తిరుగుప్రయాణం కట్టాడుతన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన  ముఖ్య  భటుడిని పంపాడుఅదే సమయంలో ఇక్కడ కళావతిలీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నారుఅది చివరలో ఉంది సంతోషవార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించి కళావతిని రమ్మని తాను ముందుగా వెళ్తుంది.  భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరుగెత్తుకొచ్చిందిఅది చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగి పోయేలా చేసాడు. కళావతి భర్త కనబడక పోవటంతో ఎంతో దుఃఖించిందిఆమె దురవస్థ చూసి తండ్రిబంధువులు అందరూ చాలా బాధపడ్డారులీలావతి భర్తను చూసి, " స్వామీఇది అంతా  భగవంతుని మాయఆ నారాయణుని  యొక్క మాయని తెలుసుకొన శక్తులెవరు?" అని విలపించిందికళావతి తన భర్తతో సహగమనం చేయటానికి ఉద్యుక్తురాలయింది వైశ్యుడు తన శక్తి కొలది సత్యదేవుని పూజ చేస్తాను,అని   దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేసాడుఅప్పుడు సత్యదేవుడా వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలికాడు. “ సాధూ నీ కుమార్తె  నా ప్రసాదమును తినకుండా భర్తను చూడటానికి పరుగెత్తుకు వచ్చిందిఅందుకే ఇలా జరిగిందిఇప్పుడు ఇంటికి పోయి ప్రసాదం తినివస్తే అంతా సవ్యంగా జరుగుతుంది.” కళావతి అలాగే చేసిందిఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకి చేరాడుఅక్కడికక్కడేఅప్పటికప్పుడే  వైశ్యుడు సత్య దేవుని పూజ చేసి  తర్వాతే  ఇంటికి వెళ్ళాడుఅప్పట్నుంచి ప్రతి పూర్ణిమకిసంక్రాంతికి ఈ వ్రతం ఆచరించి ఇహపర సుఖములను పొందాడు.

          ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయః॥   ఓం తత్సత్॥

          శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥ నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ హరతి॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

                                         ॥అథ పంచమోధ్యాయః॥

          ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజొకడు గలడుఒకసారి అతను వేటకి పోయి బాగా అలసి ఒక   చెట్టుకింద సేద దీరుతున్నాడుఅక్కడ అదే చెట్టు వద్ద గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ పూజ చేసి, ఆ తరువాత  రాజుగారికి  భక్తి  శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చి ఇచ్చారు. వారు హీన కులస్తులు అని వారు  ఇచ్చిన ప్రసాదం భుజించటం ఇష్టంలేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్ళిపోయాడుఅతని ధిక్కారానికి శిక్షగా అతని నూరుగురు కొడుకులు మరణించారుధనధాన్యములు అన్ని నశించాయిరాజు తన సత్యదేవుని లెక్క చేయక పోవటం చేతనే ఇలా జరిగిందని గ్రహించి  గోపకుల దగ్గరకెళ్ళి వాళ్ళతో కలిసి   సత్యదేవుని పూజించాడుఅప్పుడతని నూరుగురు కొడుకులనుధనధాన్యములను తిరిగి పొందాడు. " మునులారాచూసారా!ఎవరు మిక్కిలి దుర్లభమైన  సత్యపూజ చేస్తారో వారు సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారునాలుగు వర్ణాలలో  వర్ణం వారైనా చేయెచ్చుఎప్పుడైనా చేయెచ్చుపుత్రులని పొందుతారుబంధ విముక్తి పొందుతారుభీతుడు భయం కోల్పోతాడుచివరికి సత్యపురమునకి వెళ్తాడుశౌనకాది మునులారా వ్రతముచే మనుష్యుడు దుఃఖము నుండి ముక్తి గల వాడవుతాడో అట్టి సత్యనారాయణ ప్రతమును మీకు  చెప్పాను.                   ఇది  కలియుగములో విశేషఫలప్రదము గలది,  దేవుడిని  సత్యేశ్వరుడనిసత్యనారాయణుడనిసత్య దేవుడని కూడా చెప్తారుసత్య దేవుడు ఆయా రూపములను ధరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చి సత్యరూపుడు కాగలడుకావున  మునిశ్రష్టులారా వ్రతమును నిత్యము ఎవరు చేస్తారో ఎవరు వింటారో వారి పాపములు సత్య దేవుని కృపచే నశించునని శౌనకాది మహామునులకు సూతుడు చెప్పాడు.

        ఇతి స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమో ధ్యాయః॥     ఓం తత్సత్॥ శ్రీ సత్య…..స్వామి కి జై॥

             శ్రీ రమా సహిత సత్యనారాయణ దేవాతాభ్యోనమః॥ గంధ పుష్ప అక్షతాం సమర్పయామి। దూపం స.మి॥దీపం స.మి॥

                 నైవేద్యం{కొబ్బరికాయ కొట్టాలి మహా నైవేద్యం సిరా ప్రసాదం పంచామృతాలు కొబ్బరి అరటి పళ్ళు కొబ్బరి నీళ్ళు  లేదా అరటిపండు} నైవేద్యం స. మి॥ 

        మంగళ హరతి॥           మంత్ర పుష్పం॥    

శ్లో॥ యస్య స్మృత్యాచ నో మోక్త్యా  తపః పూజాక్రియాదిషు।

           న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం॥

 శ్లో॥  మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన। 

       యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే॥

          అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయా  చ                        భగవాన్సర్వాత్మకః శ్రీ రమా సహిత సత్య నారాయణ స్వామ                    దేవతా  స్సుప్రీతా సుప్రసన్నావరదా భవతు॥

               ॥ఏతత్ఫలం సత్యనారాయణ స్వామి చరణారవిందార్పణమస్తు ॥                        అంటూ అక్షతలు నీటితోపాటు అరవేణంలో వదలవలెను.  

                    పిమ్మట  శ్రీ సత్యనారాయణ   ప్రసాదం శిరసాగృహ్లామి అని అక్షంతలు 

                         పైన వేసుకోవాలి.

         ఉత్తర పూజ॥ పునఃపూజార్థే ….. నమస్కరోమి॥ ఉద్వాసన॥  శ్లో॥ గచ్ఛ గచ్ఛ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర। శోభనార్థే పునరాగమనాయచ। యధాస్థానం ప్రవేశయామి.               అని ఉద్వాసన పలుకాలి.